God's Language 'Music'
- In Religion
- 03:43 PM, Mar 16, 2015
- Shanmukh, Saswati Sarkar, Aparna, Dikgaj and Kirtivardhan Dave
ఈశ్వరభాష, ఈ ‘స్వర’ భాష . నాగ అంబటిపూడి
ఓంకారం ఆదిప్రణవనాదం. నారదుని మహతీవాదంలో నాదం పుట్టి, భక్తి భావావేశంలోని భాషాసాన్నిత్యంతో , సాహిత్యంచ , సంగీతం సారస్వతీచరణద్వయం,ఏకమాలోచనమృతం, అన్యమాపత మధురంగా, మనసుని రంజింప చేస్తాయి.
పదాన్ని స్వరపధాన నడిపించి ,పదజతులకు కృతులు కట్టిన , కృతార్ధులేందరో మహానుభావులు , వాగ్గేయకారులు. ఆమృతవాక్కును గేయంగా, నిర్ధిష్టరాగంలో రంగరించి, శృతి,లయానుసారం వినసొంపుగా, ఇంపుగా, రససిద్ధి కల్పించడమే వాగ్గేయకరుని విశిష్టవిధి. ఈ నియమాలను, నిష్టగా పాటించిన త్రయం, తంజవురు తరించిన, త్యాగరాజు, శ్యామ శాస్త్రి , ముత్తుస్వామి దీక్షితుల దీక్షలు, కర్ణాటక సంగీత కఠీరవం .
మధ్య యుగ భారతీయ భక్తి చైతన్య ఉద్యమంలో ,దక్షిణ భారత సనాతన శాస్త్రీయ సంగీతం ప్రసిద్దమైనది. అద్వైత సిద్ధి, అమరత్వలబ్ధి ,జీవన్ముక్తి సూత్రం సంగీతం.భాషా బేధల్లేని , ఏకేశ్వరోపాసన ఈశ్వరభాష, ఈ స్వర భాష.
శబ్ధాన్ని శాస్త్రియ చట్రంలోబంధించి నాద నియమాన్ని నియంత్రించి పాట పాఠవాన్ని పెంచగలిగింది సంగీతమే.
జానకీ ప్రాణనాయకుణ్ణి జగదానందకారకా అన్నా , ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అని నిలదీసినా వాగ్గేయకారుల వాక్సుద్ధికి ,సిద్ధికే చెల్లింది.
భక్తి ప్రపత్తుల ఉత్తర దేశం ,భజన సాంప్రదాయన్ని భుజస్కంధాలపైకెత్త , దక్షిణ భారతం , అర్చనం, పాదసేవనం కీర్తనంద్వార భగవత్సన్నిధి చేరవచ్చున్న చిదంబర రహస్యాన్ని సూత్రీకరించింది.
నవవిధ భక్తి సూత్రాల్లోని కీర్తనాన్ని విశేషంగా కీర్తించింది కర్ణాటక సంగీతమే, నగర సంకీర్తనం , ఆరాధనోత్సవాలద్వార సంగీతాన్ని సమాజంతో, సమైక్యం చేసింది .
కోయిలమ్మ కూతలో కృతినిబట్టి, శృతినికనిపెట్టి , నెమలి నడకలో తాళం నడతనెరిగి ,సెలయేటి అలల సవ్వడిలో స్వరమెరిగి ప్రాకృతిక సహజ సిధ్ధాంత శృతి శాస్త్రీకరణమే కర్ణాటక సంగీతం . పాలకై రోదించు పసిపాపాయి పాడేది అరున్నొక్క రాగమని నిర్ధారించింది.
బ్రతుకున లేని శృతికలదా, ఎదసడిలోనే లయలేదాన్న సత్యాన్ని గ్రహించిన సంగీతం ఆరోహణ, అవరోహణ,శృతి,లయ ,సరళీవరసులు మనిషి మనుగడన్నించే నేర్చుకుంది.
సామవేదసారాన్ని సంగ్రహంగా స్వీకరించి గంభీర, లలిత ,కోమల , మాధుర్య శభ్ద సాధుత్వ సాధన, పరిశ్రమ, పరిశోధనద్వార ప్రసన్నమోనని నిరూపించింది. అనగననగరాగమతిసయమౌను కదా !
పురంధరదాసుని, విశేష శాస్త్రీయ కృషికి పులకరించిన కర్ణాటక సంగీతం, పితామహునిగా గుర్తించి గౌరవించింది. పురంధరుని, రాగ మాయామాళగౌళ కర్ణాటక సంగీత అభ్యాస శ్రీకారనికి ప్రధమ పుస్తక రూపం.
నానాటి బతుకు నాటకమని నిగ్గుతేల్చినా, పరమాత్మా! నేవెందో పరాకైవున్నావని పలకరించినా , నరహరి నుతులతో,నానిన జిహ్వ, పరులనుతించగ ఓర్వదు జిహ్వ అని సాల్వ నరసింహరాయ , రాజ ఆనను ధిక్కరించి అన్నమయ్య ఆవిష్కరించిన అంతర్యామి అనాధనాధుడు, దీనరక్షకుడు ,
తిరు వేంకటనాధుడు. పదకవితా పితమహుని సంకీర్తనల స్వరించి, తరించింది కర్ణాటక సంగీతం.
సుబ్బులక్ష్మి సుప్రభాతంతో శ్రీనివాసుడు, మంగళంపల్లి పాడిన రామదాసు కీర్తనలతో భద్రాద్రి రాముడు, అరుణ్ అభంగులతో పాండురంగని దినచర్య దివ్యమౌతుంది.
ప్రపంచంలోని ఏన్నో సంగీత శాస్త్రాలలో కర్ణాటక సంగీతం అతిసహజ శాస్త్ర విధానమనడంలో అతిశయోక్తిలేదు.
పేరుకు కర్ణాటక సంగీతం, తెలుగు సాహిత్యం,తమిళ వాయిద్య బృందం ,మలయాళీ గాయకులు వెలసి సాక్షాత్తు దక్షిణ భారత సమ్మిళితం సంగీతం కర్ణాటక సంగీతం.
ఐక్యరాజ్య సమితిలో ప్రధమంగా,ప్రమోదంగా కర్ణాటక గాన కచేరి చేసిన భారతజాతి రత్నం
యం.యెస్ .సుబ్బులక్ష్మి , కోట్ల గుండెల కోటల్లో కోలువుదీరిన గాన కోకిలమ్మ.
మానసిక ౠగ్మతలకు మందెరిగిన మంగళంపల్లి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ఆరోగ్య ఉపసమనానికి సృజించిన సరికొత్త రాగాలెన్నో. భారత జాతి గుర్తించదగ్గ రత్నం మన మంగళంపల్లి.
సమకాలీన సంగీత సార్వభౌముడు, తేట తెలుగువాడు.
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒక మంచి వీణావిద్వాంసుడని , రాష్ట్రపతి భవన్లో తీరిక సమయంలో కలాం నేస్తం కర్ణాటక సంగీతమేనని అతికొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం.
కన్నడన దాసరపదగళు , తమిళనాట ఊతుకూరి వెంకటకవి ,మరాఠీన ఆభంగులు కర్ణాటక భక్తి సంగీతాన్ని సుసంపన్నం చేసాయి.
కర్ణాటక సంగీత వాయిద్య విశేషాలన్ని విశేషాలే, శృతికి తంబూర, తాళానికి మృదంగం,
రాగానికి వీణ.ఘటం ఒకటేమిటి , ముఖ్యంగా ,జర్మనీకి చేందిన వాయలెన్ను , మండొలెన్ను కచేరిలో చేర్చేసుకొని సంగీతనికి స్వరాలే తప్ప, స్పర్ధలు, మనస్పర్ధలు లేవని నిరూపించింది సంగీతం.
వీణావాదనికి చిట్టిబాబు ,మృదంగనికి కరైకూడి మణీ వాయొలిన్ కి వైద్యనాధన్,మండలిన్ కి శ్రీనివాస్ ప్రఖ్యాతులు.
ఆధునిక పొటీప్రపంచంలో గాత్ర శృతికి ఐఫొను అప్ప్ వుందంటే ఆచర్యం లేదు.
స్వర శిక్షణ,గాత్ర క్రమశిక్షణకు పక్కింటి పంకజం పిన్నిగారి పంటికింద నలిగిన మిరియాలు, పాలతో కలిసి మరిగిన పసుపు ఏంతో.
దక్షిణాదిన తమిళ, కన్నడ కుటుంబాలలో ఏక్కువగ శాస్త్రీయ సంగీత సాధన జరుగుతోంది.
సుమారు 3000 కోట్ల రూపాయల వ్యాపార విపణిగల భక్తి సంగీతం, ప్రసుత కాలంలో టి.వి. మాధ్యమాలద్వారా, శాస్త్రీయ సంగీతంపై ప్రజలు మక్కువ చూపటం శుభసూచికం.
ప్రవాస భారతీయంలో, స్దానికంగా ,ఆయ్యగారి సీతారాం, మణి శాస్త్రి , రాజరాజ్వేశ్వరి కలగ,
సౌజన్య మాడభూషి ,కర్ణాటక సంగీతాన్ని ఆమెరికాలో బహుళ ప్రచుర్యానికి తెచ్చిన ప్రసిద్దులు.
రోజుకో రాజీతో, కాలం ఒత్తిడిని తట్టుకోవాలంటే , కప్పు కాఫీ , కమ్మని సంగీత కచేరి కావాలిమరి !
ఉత్తరాదిన హిందుస్తానీ,వంగ దేశంలో రబీంద్ర సంగీత్ ,ఇస్లాం సాంప్రదాయంలో సూఫీ జనాదరణ పొందిన సంగీత సౌరభాలు.
శిశివులు,పశువులు,పాములే పరవసించిన సంగీతాన్ని పామరులకు సైతం ప్రసాదించి , పరమానందం పొందాలని , మురళికిగల స్వరములసుధ పెదవిని విడి పలుకదని గ్రహించినప్పుడే,
జీవరసైక సిద్ధి సాధ్యం, ఆత్మ కోయిలకు ముక్తి తధ్యం.
సంగీత సంస్కారానికి నమస్కారంతో
నాగ అంబటిపూడి
Comments